చిత్తూరు: కాంగ్రెసుకు భయపడవద్దని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలకు హితవు చెప్పారు. ఆయన శనివారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో శనివారం పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలో నెలకోసారి పర్యటిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనను అధిక మెజారిటీ గెలిపించిన నియోజకవర్గం కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట శాసనసభ్యుడు గాలి ముద్దకృష్ణమ నాయుడు, ఇతర నాయకులు ఉన్నారు.