జూన్ 1నుంచి లోకసభ సమావేశం
న్యూఢిల్లీ: 15వ లోకసభ తొలి సమావేశం జూన్ 1వ తేదీ నుంచి జరగనుంది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శనివారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హోం మంత్రి చిదంబరం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జూన్ 4వ తేదీన ప్రసంగిస్తారు. అదే రోజు రాజ్యసభ కూడా సమావేశమవుతుంది.
లోకసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు జూన్ 1, 2 తేదీల్లో ప్రమాణం చేస్తారు. స్పీకర్ ఎన్నిక 3వ తేదీన జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూన్ 5, 8, 9 తేదీల్లో చర్చ జరుగుతుంది. బడ్జెట్ ను జూలై 31వ తేదీ లోగా ఆమోదింపజేసుకోవాల్సిన అవసరం ఉందని చిదంబరం చెప్పారు. మంత్రి వర్గ సమావేశానికి ముందు ప్రధాని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications