డిఎంకెతో విభేదాలు లేవు: ఆజాద్
న్యూఢిల్లీ: డిఎంకెతో తమకు ఎలాంటి విభేదాలు లేవని కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెసుకు, డిఎంకెకు మధ్య మంత్రి పదవుల విషయంలో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందనే నేపథ్యంలో ఆయన శనివారం ఈ ప్రకటన చేశారు. డిఎంకె తమతోనే ఉందని ఆయన చెప్పారు.
తాను చెన్నై వెళ్లడం లేదని ఆయన చెప్పారు. మాటల మధ్య అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 2004లో ప్రభుత్వంలో చేరడానికి డిఎంకె 9 రోజులు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందే తమకు డిఎంకె మిత్ర పక్షమని, ప్రభుత్వ ఏర్పాటులో డిఎంకె ప్రధానమైన మిత్రపక్షమని ఆయన చెప్పారు. డిఎంకెతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వ్యక్తుల విషయంలో తమకు పరిమితులు లేవని, డిఎంకెతో మంత్రి పదవుల విషయంలో బేరసారాలు సాగడం లేదని ఆయన చెప్పారు.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications