'సాక్షి'పై దాడిలో జెసి అనుచరుడు
అనంతపురం: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సాక్షి దినపత్రిక అనంతపురం జిల్లా తాడిపత్రి కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం జరిగిన రోజు తాడిపత్రిలోని సాక్షి కార్యాలయంపై దాడి జరిగింది. మంత్రి పదవి దక్కని తాడిపత్రి శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దాడి చేసింది తన అనుచరులు కాదని జెసి చెప్పారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒక వ్యక్తి జెసి దివాకర్ రెడ్డి అనుచరుడని తెలుస్తోంది. మరో వ్యక్తి ఒక పత్రికా విలేకరి కాగా మరో ఇద్దరు ఎంసిఎ విద్యార్థులని సమాచారం. వీరిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications