బస్సు దూసుకెళ్లి వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా శ్రీశైలంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణికులపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. ఇతన్ని ఆదిలాబాద్ జిల్లా నారాణపూర్ గ్రామానికి చెందిన ఎస్కే సర్వర్ గా గుర్తించారు. సర్వర్ తన కుటుంబ సభ్యులతో గురువారంనాడు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాడు. మొత్తం 11 మంది కుటుంబ సభ్యులు శ్రీశైలం వచ్చారు.
గురువారం రాత్రి వారంతా బస్ స్టాండులోనే పడుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులంతా శుక్రవారం ఉదయం మళ్లీ స్వామివారి దర్శనానికి వెళ్లారు. సర్వర్ మాత్రం పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో సాయిశ్రీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రయాణికుల మీది నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సర్వర్ మృతి చెందాడు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications