స్పీకరు పదవికి టీడీపి పోటీ

కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్ పదవికి ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి రోశయ్య తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్ద్వారా సమాచారం అందించినట్లు జనార్దన్రెడ్డి తెలిపారు. దీనిపై తమ నిర్ణయాన్ని అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చించి వెల్లడిస్తామని తెలిపారు. ఆనవాయితీ ప్రకారం ప్రొటెం స్పీకర్ పదవిని సీనియర్ అయిన అశోక్ గజపతిరాజుకు ఇవ్వకుండా జేసీకి కేటాయించడాన్ని నాగం తప్పుబట్టారు.
కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయితే కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగాను, తెలుగుదేశం పార్టీ సభ్యుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించే అవకాశాలున్నాయని చంద్రబాబు ఈ పదవికి పోటీ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. పైగా గత ఐదేళ్ళుగా ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరించిన కిరణ్ కమార్ రెడ్డి అడుగడుగునా టిడిపి సభ్యులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అడ్డుపడ్డారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా మరెవ్వరినైనా స్పీకర్ అభ్యర్థిగా ప్రకటిస్తే టిడిపికి అభ్యంతరం ఉండకపోయేది. ఈ నేపథ్యంతో ఈ సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించి అశోక్ గజపతిరాజును బరిలో దింపాలని నిర్ణయించారని తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
2029లోనూ ఏపీలో ఎవరు గెలవచ్చు ? తేల్చేసిన ఉండవల్లి..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications