జూనియర్ వైద్యుల సమ్మె విరమణ
హైదరాబాద్: తమపై జరిగిన దాడికి నిరసనగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి జానియర్ డాక్టర్లు శనివారం నాలుగో రోజు కూడా సమ్మె చేశారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ రాతపూర్వకంగా కావాలని వారు పట్టుబడుతున్నారు. రాతపూర్వకమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని వారు చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు వారు సమ్మెను విరమించుకున్నారు.
ఓ గర్భిణి మృతి సందర్భంగా డాక్టర్లపై బాధితురాలి బంధువులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా డాక్టర్లు సమ్మెకు దిగారు. వారికి సీనియర్ వైద్యులు కూడా మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలు చేశారు. నిందితులను అరెస్టు చేసేవరకు సమ్మె విరమించేదిలేదని వారు స్పష్టం చేశారు. రోగులకు తీవ్ర ఇబ్బందులు కలగటంతో పోలీసులు రంగంలోకి దిగి డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. దీంతో సమ్మె విరమించేందుకు డాక్టర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు.
Comments
Story first published: Saturday, June 13, 2009, 11:35 [IST]