వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబైలో ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ
ముంబయి: ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 36 ఏళ్ల ఇంజినీర్ కు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. మహారాష్ట్రలో ఇదే తొలి స్వైన్ ఫ్లూ కేసని అధికారులు శనివారం చెప్పారు. మధ్య అమెరికాలోని హొందురాస్ ను ఆయన ఇటీవల సందర్శించారు. ఈ సందర్భంగా స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానిస్తున్నారు.
వైద్య పరీక్షల్లో ఆ ఇంజినీరుకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని డాక్టర్ ప్రదీప్ అవాతే చెప్పారు. కస్తూర్బా ఆస్పత్రిలో అతనికి చికిత్స చేస్తున్నారు. ఆ ఇంజినీర్ జూన్ 8వ తేదీన హొందురాస్ కు వెళ్లి 15వ తేదీన భారత్ కు అమెరికాలోని న్యూజెర్సీ మీదుగా తిరిగి వచ్చాడు.
Comments
Story first published: Saturday, June 20, 2009, 12:38 [IST]