59కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. ఆదివారంనాడు మరో మూడు కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య పెరిగింది. అమెరికా నుంచి చెన్నైకి వచ్చిన దంపతులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది.
29 ఏళ్ల ఒక వ్యక్తి, అతని భార్య ఈ నెల 13వ తేదీన నార్త్ కరోలినా నుంచి చెన్నైకి వచ్చారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైన బాలుడు ఈ నెల 17వ తేదీన న్యూయార్క్ నుంచి వచ్చాడు. ఇప్పటి వరకు 421 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.
More From
-
ఆ వెబ్సైట్నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ?? -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications