59కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. ఆదివారంనాడు మరో మూడు కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య పెరిగింది. అమెరికా నుంచి చెన్నైకి వచ్చిన దంపతులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలో 15 ఏళ్ల బాలుడికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది.
29 ఏళ్ల ఒక వ్యక్తి, అతని భార్య ఈ నెల 13వ తేదీన నార్త్ కరోలినా నుంచి చెన్నైకి వచ్చారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైన బాలుడు ఈ నెల 17వ తేదీన న్యూయార్క్ నుంచి వచ్చాడు. ఇప్పటి వరకు 421 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.
Comments
india భారత్ america chennai చెన్నై న్యూఢిల్లీ అమెరికా usa న్యూయార్క్ swine flu స్వైన్ ఫ్లూ యుఎస్ ఎ నార్త్ కరోలినా
Story first published: Monday, June 22, 2009, 9:41 [IST]