రాఖీ స్వయంవరం నేటి నుంచే

ప్రతీవారం వరులు తమ వ్యక్తిత్వం, స్వభావం, శారీరక దృఢత్వం, తెలివి తదితర అంశాలను ప్రదర్శిస్తూ రాఖీపై ప్రేమను ఒలకబోయాలి. ఈ ప్రయాణంలో చివరగా రాఖీ ఓ అదృష్టవంతుడితో భారీ వేడుకలో తాళి కట్టించుకొంటుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే 16 మంది వరులు స్వయంవరానికి సిద్ధమయ్యారు. డ్యాన్స్ షోలతో గుర్తింపు పొందిన రామ్ కపూర్ ఈ 'స్వయంవరం' షోను నిర్వహించనున్నారు. రాఖీ స్నేహితులు షోకి హాజరై సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆమెకు సహకరిస్తారు. ఈ కొత్త ప్రయాణం విషయమై రాఖీ మాట్లాడుతూ 'నాకు చాలా భయంగా ఉంది. అదే సమయంలో ఉత్సుకతగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. నా జీవిత భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎన్నుకోగలనన్న నమ్మకం ఉంది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ దశలో స్నేహితుడు రామ్, ఇతర శ్రేయోభిలాషుల సహాయాన్ని ఉపయోగించుకొంటాను' అని చెప్పారు. షో జరిగే ఉదయ్పూర్, ఫతేగఢ్ రాజభవనాల గురించి మాట్లాడుతూ అద్భుతమైన, అందమైన ప్రాంతాలని అభివర్ణించారు. తన స్వయంవరానికి ఇంతకంటే మంచి ప్రాంతాలను ఊహించలేకపోతున్నానని చెప్పారు. 'అందరు వరులతో కొద్దిసేపు మాట్లాడాను. అందరూ బాగున్నారు. అయితే తుది విజేత ఎవరనేది ఇప్పుడే చెప్పలేను' అని రాఖీ పేర్కొన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications