బాబ్లీ పాపం కాంగ్రెసుదే: చిరు

Chiranjeevi
హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు పాపం కాంగ్రెసుదేనని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శించారు. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉందని, అయినా బాబ్లీ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును తక్షణం అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన ప్రధానిని కోరారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టులో మన రాష్ట్రం తరఫున వాదించడానికి సరైన న్యాయవాదుల నియామకం కూడా జరగలేదని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ఎడారిగా మారితే అందుకు కాంగ్రెసు పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

బాటిళ్ల ద్వారా లీటర్ రెండు రూపాయల నీళ్లను పంపిణీ చేసే పథకంపై అనుమానాలున్నాయని ఆయన అన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చి పెట్టేందుకే ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన సందేహించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సరిగా సరఫరా చేయడం, పంటలకు గిట్టుబాట ధర కల్పించడం వంటి సౌకర్యాలు కల్పించిన తర్వాత కూడా ఫలితం రాకపోతే కొత్త విధానాన్ని అనుసరించడం అవసరమని, అదేమీ లేకుండా ప్రభుత్వం సహకార వ్యవసాయాన్ని ప్రారంభించబోతోందని, ఇది సరైన చర్య కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+