హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాడిలో పడండి: మంత్రులతో వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: మంత్రులు గాడిలో పడాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సూచించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన సూచన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరింత కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. మరో రెండు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల జరిగే అవకాశాలున్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెసుకు 51 శాతం వోట్లు పడేలా కష్టపడాలని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే శాసనసభ్యుడు టీవి రామారావు వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. టీవి రామారావు వ్యవహారంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కాగా, సహకార సేద్యం పైలట్ ప్రాజెక్టుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు సమాచార, పౌర సంబంధాల మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మంత్రివర్గ సమావేశం వివరాలను ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. జిల్లాకు ఒకటి రెండు గ్రామాలను తీసుకుని సహకార సేద్యాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఈ విషయంలో రైతులను బలవంత పెట్టబోమని ఆయన చెప్పారు. రైతులు సహకార సేద్యంలో భాగస్వాములుగా కూడా చేరవచ్చునని ఆమె అన్నారు. మంత్రులందరూ సహకార సేద్యం బాగుంటుందని అభిప్రాయపడినట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X