రాజ్యాంగేతర శక్తిగా కెవిపి కమిటీ: సిపిఐ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కెవిపి రామచందర్ రావు చైర్మన్ గా వేసిన ప్రజా భద్రతా సలహా సంఘం రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. కమిటీ చైర్మన్ గా కెవిపి రామచందర్ రావును నియమించడాన్ని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. ఆ కమిటీని వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికార దురహంకారంతోనే బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డిపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం దాడికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. మందా జగన్నాథంపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా వుంటే, తాను బ్యాంక్ మేనేజర్ పై దాడి చేయలేదని, భుజం పట్టుకున్నానని, దాంతో తాను చేయి చేసుకున్నట్లు కనిపిస్తోందని మందా జగన్నాథం ఒక తెలుగు టీవి చానెల్ ప్రతినిధితో అన్నారు. అడిగితే తాను పిసిసికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. కాగా, మందా జగన్నాథం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని పిసిసిని కోరినట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమొయిలీ చెప్పారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications