ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతడిని తన్నించడం ఒక పనా? రాజకుమారి

By Staff
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో తనకు బంధువులు ఉన్నారని, వారు తలచుకుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఎముకల్లో సున్నం లేకుండా తంతారని, తానే వారిని ఆ పనికి పురమాయించలేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మంగళవారం ఉదయం ఇక్కడ వ్యాఖ్యానించారు. దగ్గుబాటి కుటుంబ సభ్యులు రక్త పిపాసులని, దళిత వ్యతిరేకులని ఆమె అన్నారు. ఆనాడు దగ్గుబాటి కుటుంబం దళితుల ఊచకోతకు పాల్పడినందు వల్లనే తెలుగుదేశం పార్టీకి అప్రదిష్ట వచ్చిందని ఆమె అన్నారు.

తాను ముఖ్య నాయకులకు చేపల పులుసు వడ్డించి రాజకీయాల్లో పైకి వచ్చానని దగ్గుబాటి వ్యాఖ్యానించాడని, మరి ఆయన భార్య పురందరేశ్వరి ఎవరికి చేపల పులుసు వడ్డించి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ అల్లుడు, కూతురు కాబట్టి తానింకా ఆలోచిస్తున్నానని ఆమె అన్నారు. తనను నడిరోడ్డు మీద చీర లాగి అవమానించారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X