హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయశాంతి పోతే పోనీ: కెసీఅర్

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ సమావేశానికి విజయశాంతి హాజరు కాలేదు. పార్టీలో కీలకపదవుల్లో ఉన్న రాములమ్మ..ఈ కీలక సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై పార్టీ శ్రేణులు అసంతృప్తి..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎంను కలిసిన తర్వాత కూడా కెసీఅర్ కు, పార్టీకి ఆమె అందుబాటులోకి రాలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సన్నాహకంగా తొలిసారి తెలంగాణ భవన్‌ లో ఆదివారం పార్టీ సమావేశం జరిగింది. పార్టీ మారే ఆలోచన..పార్టీకి దూరమయ్యే ఉద్దేశం లేకపోతే ఆమె ఈ సమావేశానికి వచ్చేవారని కొందరు అంచనావేశారు.

అయితే రాములమ్మ ఇటువైపే రాలేదు. మెదక్‌ జిల్లాకు సంబంధించి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు పార్టీ నేతలకు ఆదివారం ఫోన్‌ లో కూడా దొరకలేదని టీఆర్‌ ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ పార్టీ 'గ్రేటర్‌' సమావేశం జరుగుతుండగా..సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్‌ లోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో సమావేశమై.. తన భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు పార్టీ ముఖ్యులు కొందరు చెబుతున్నారు. విజయశాంతి టీఆర్‌ఎస్‌ కి దూరమవుతున్న సంకేతాలు అధిష్ఠానానికి 20రోజుల క్రితమే అందినట్లు తెలిసింది.

కెసీఅర్ కరీంనగర్‌లో ఉన్నప్పుడు మెదక్‌ జిల్లాకు చెందిన ముఖ్యనేత ఒకరు.. రాములమ్మ కాంగ్రెస్‌ కి చేరువవుతున్న సమాచారాన్ని ఆయన చెవుల్లో వేసినట్లు సమాచారం. దీన్ని కెసీఅర్ తేలిగ్గా తీసుకోవటమేకాక..'పోతే పోనియ్యి..పోయేటోళ్లను ఎవరు ఆపుతారు' అన్నట్లు తెలిసింది. అందువల్లే తాజా పరిణామాలపై పార్టీ అధికారికంగా స్పందించటంలేదని సమాచారం. ఈ క్రమంలో తొలి నుంచి అనుమానాస్పదంగా ఉన్న ఆమె వైఖరి పూర్తిగా బయటపడిన తర్వాతే నోరు విప్పాలని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X