విజయశాంతి పోతే పోనీ: కెసీఅర్
అయితే రాములమ్మ ఇటువైపే రాలేదు. మెదక్ జిల్లాకు సంబంధించి సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు పార్టీ నేతలకు ఆదివారం ఫోన్ లో కూడా దొరకలేదని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ పార్టీ 'గ్రేటర్' సమావేశం జరుగుతుండగా..సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో సమావేశమై.. తన భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నట్లు పార్టీ ముఖ్యులు కొందరు చెబుతున్నారు. విజయశాంతి టీఆర్ఎస్ కి దూరమవుతున్న సంకేతాలు అధిష్ఠానానికి 20రోజుల క్రితమే అందినట్లు తెలిసింది.
కెసీఅర్ కరీంనగర్లో ఉన్నప్పుడు మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యనేత ఒకరు.. రాములమ్మ కాంగ్రెస్ కి చేరువవుతున్న సమాచారాన్ని ఆయన చెవుల్లో వేసినట్లు సమాచారం. దీన్ని కెసీఅర్ తేలిగ్గా తీసుకోవటమేకాక..'పోతే పోనియ్యి..పోయేటోళ్లను ఎవరు ఆపుతారు' అన్నట్లు తెలిసింది. అందువల్లే తాజా పరిణామాలపై పార్టీ అధికారికంగా స్పందించటంలేదని సమాచారం. ఈ క్రమంలో తొలి నుంచి అనుమానాస్పదంగా ఉన్న ఆమె వైఖరి పూర్తిగా బయటపడిన తర్వాతే నోరు విప్పాలని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు.