హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణంరాజు లేఖ అందలేదు: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పార్టీకి రాజీనామా చేస్తూ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు రాసిన లేఖ తనకు అందలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. లేఖ అందకుండా తాను ఏమీ మాట్లాడలేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. లేఖ అందిన తర్వాత స్పందిస్తానని ఆయన అన్నారు. కృష్ణంరాజు రాజీనామా చేసిన సమాచారం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన ఆ విధంగా స్పందించారు.

తన కుమారుడు రామ్ చరణ్ తేజా మగధీర చిత్రంలో తన అంచనాలకు మించి నటించాడని ఆయన ప్రశంసించారు. కాగా, మొన్న తాను రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపానని కృష్ణంరాజు చెబుతున్నారు. అయినా చిరంజీవి ఆ లేఖకు సంబంధించిన సమాచారం తనకు అందలేదని చెప్పడం ఆశ్చర్యకరంగానే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X