వైయస్, బాబు మాటల సమరం

మెట్రో రైలు ప్రాజెక్టులో అవకతవకలు జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మేటాస్ సంస్థకు ఆర్థిక సామర్థ్యం లేదని తెలిసిన వెంటనే కాంట్రాక్టు రద్దు చేశామని ఆయన చెప్పారు. ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధరన్ మేధావి అయితే కావచ్చు గానీ ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు కూలిపోతే ఏమీ చేయలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి చర్చను హైదరాబాద్ అభివృద్ధికి మళ్లించారు. చంద్రబాబుకు తొమ్మిదేళ్లు కూడా కృష్ణాజలాలను హైదరాబాదుకు తీసుకురావడానికి కుదరలేదని ఆయన అన్నారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయి వుంటే హైదరాబాద్ అంతా బోలక్ పూర్ అయి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో తాము చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ సమయంలో చంద్రబాబుకు, వైయస్ కు మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications