Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

Vijayanagaram
విజయనగరం: రాష్ట్రంలో మరో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా జామి మండలం కుమరాం బలరాంపురం గ్రామం వద్ద జరిగింది. అప్పారావు అనే ప్రేమోన్మాది బస్సులో ప్రయాణిస్తున్న భాగ్యలక్ష్మి అనే యువతిపై దాడి కత్తితో ఆమె గొంతు కోశాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని అప్పారావు భాగ్యలక్ష్మిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను గురువారం ఈ దాడికి పాల్పడ్డాడు.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితురాలిని చికిత్స నిమిత్తం విజయనగరం ఆస్పత్రికి తరిలించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భాగ్యలక్ష్మి తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+