మీరు గొడవ చేయలేదా: కేశవ్

Sonia Gandhi
హైదరాబాద్: గతంలో మీరు గొడవ చేసిన విషయాన్ని మర్చిపోయారా అని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ కాంగ్రెసు వారిని ప్రశ్నించారు. గురువారం శాసనసభలో కరవు పరిస్థితులపై చర్చలో పాల్గొంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెసు చేస్తున్న విమర్శను ప్రస్తావిస్తూ మీరు గొడవ చేయలేదా అని ఆయన అడిగారు. అనంతపురం జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని హుటాహుటిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని తీసుకొచ్చారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విషయం ఇక్కడే జరిగినట్లు వ్యవహరించారని ఆయన అన్నారు. కరవు గురించి ప్రధాని కూడా మాట్లాడారని, మరి ఇప్పుడు సోనియా గాంధీ ఎందుకు రాలేదని ఆయన అన్నారు. ఆమెకు తీరిక లేదా మీరు పిలువలేదా అని ఆయన అడిగారు.

రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై, రైతులు పడుతున్న ఇబ్బందులపై తామ మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అనడం శోచనీయమని ఆయన అన్నారు. బడిపిల్లలు మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకుంటున్నారని, కళాశాల విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కరువు మండలాల ప్రకటనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు. వివిధ సంఘటనలను ఆయన ఉదహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+