ఎమ్మెల్యేలకు మగధీర ఉచిత షో
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమాను రాష్ట్ర శాసనసభ్యుల కోసం ఉచితంగా ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్ తేజ తండ్రి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఆందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని శాసనసభ్యుల కోసం మంగళవారం రెండు షోలు ఉచితంగా ప్రదర్శిస్తారు. అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో థియేటర్లను సిద్ధం చేశారు.
మగధీర సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మగధీర సినిమా కోసం ప్రేక్షకులు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సంతోషాన్ని చిరంజీవి పూర్తిగా అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications