వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి నేతలకు జస్వంత్ దూరం
తన పుస్తకంలో మొహమ్మద్ అలీ జిన్నాను జస్వంత్ ప్రశంసించారు. ఆయన రాసిన జిన్నా - ఇండియా, పార్టీషన్, ఇండిపెండెన్స్ పుస్తకంపై బిజెపి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన మంగళవారం రాత్రే ఇక్కడికి చేరుకున్నారు. ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లతో పాటు పార్టీ నేతలంతా ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయగా జస్వంత్ సింగ్ మాత్రం ఒబెరాయ్ గ్రూపునకు చెందిన హోటల్ సెసిల్ లో బస చేశారు.
ప్రభుత్వ అతిథి గృహంలో జస్వంత్ సింగ్ కు ఏర్పాట్లు చేశామని, ఆయన బయట ఉంటున్నట్లు తమకు చివరి నిమిషంలో తెలిసిందని పార్టీ సీనియర్ నాయకుడొకరు అన్నారు. జస్వంత్ సింగ్ తన గదికే పరిమితమయ్యారు. లోకసభ ఎన్నికల్లో ఓటమిపై, వచ్చే హర్యానా ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై పార్టీ సమావేశం జరుగుతోంది.
Comments
Lok sabha rajnath singh lk advani shimla సిమ్లా jaswant singh ఎల్ కె అద్వానీ రాజ్ నాథ్ సింగ్ జస్వంత్ సింగ్ bjp leaders jinnah బిజెపి నేతలు
Story first published: Wednesday, August 19, 2009, 13:32 [IST]