మంత్రుల వ్యాఖ్యలపై అసెంబ్లీలో రభస

తెలుగుదేశం సభ్యులపై మంత్రి రఘువీరా రెడ్డి న్యూసెన్స్ గాళ్లంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నోర్మూసుకోండని మరో మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రులపై చర్య తీసుకోవాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. గతంలో ఏమీ వ్యాఖ్య చేయకుండానే తమ సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావును సభ నుంచి సస్పెండ్ చేశారని, ఇప్పుడు తమపై వ్యాఖ్యలు చేసిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని తెలుగుదేశం సభ్యుడు అశోక గజపతిరాజు అన్నారు. మంత్రులపై చర్యలు తీసుకునే ధైర్యం స్పీకర్ కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications