హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులు వింటున్నారు: రోశయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మంత్రులంతా తనకు సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. మంత్రులు రోశయ్య మాట వినడం లేదని, సమీక్షా సమావేశాలకు కూడా రావడం లేదని వస్తున్న వార్తలకు ఆయన గురువారం వివరణ ఇచ్చారు. తన ఆదేశాల మేరకే మంత్రులు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సంతాప సభలకు హాజరవుతున్నట్లు తెలిపారు. తనకు కొంత మంది సహకరించడం లేదని, సమావేశాలకు హాజరు కావడం లేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. నియోజక వర్గాలకు వెళ్లి సంతాప సభలు నిర్వహించాలని మంత్రులను తానే ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గురువారం జరిగిన ఆరోగ్యశ్రీ సమీక్షా సమావేశానికి ఆ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సకాలంలో హాజరైనట్లు ఆయన తెలిపారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలను బలోపేతం చేయాలని రోశయ్య అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఆయన 44 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కోసం కొత్తగా నిర్మించే భవనానికి వైయస్ పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X