జగన్ పై నిర్ణయం వాయిదా

కోర్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కెవిపి రామచందర్ రావు కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అహ్మద్ పటేల్ ను, ప్రణబ్ ముఖర్జీని వేర్వేరుగా కలుసుకున్నారు. అయితే వారు కెవిపి రామచందర్ రావు అసలు విషయం చెప్పినట్లు సమాచారం. తాను వైయస్ సంతాప సభలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్నానని కెవిపి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే శనివారం అందుబాటులో ఉండాలని వారు కెవిపికి సూచించినట్లు సమాచారం. జాతీయ పత్రికల్లో జగన్ కు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. దీంతో కెవిపి జాతీయ మీడియా ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు.
కాగా, కాంగ్రెసు నేత కె.కేశవరావు, మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అహ్మద్ పటేల్ ను కలుసుకున్నారు. ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంటుందని కేశవరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications