జగన్ దిగి వచ్చేదాకా...

శనివారం ఢిల్లీ వెళ్లిన వైయస్ ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాత్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ లతో సమావేశమయ్యారు. ఆదివారం ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం జరిగేలా చూసే వ్యూహాన్ని జగన్ వర్గం అనుసరిస్తోంది. ఈ సమావేశంలో తమ మెజారిటీని రుజువు చేసి పార్టీ అధిష్ఠాన వర్గానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలనేది ఆ వర్గం ఆలోచన. అయితే శాసనసభ్యుల్లోనూ మంత్రుల్లోనూ పార్లమెంటు సభ్యుల్లోనూ జగన్ కు మెజారిటీ ఉందనే విషయం అధిష్ఠాన వర్గానికి తెలియని విషయమేమీ కాదు. జగన్ వర్గం వ్యూహాన్ని అడ్డుకోవడమే పార్టీ అధిష్ఠాన వర్గం ప్రస్తుత ఆలోచనగా కనిపిస్తోంది.
మరి కొంత వాతావరణం చల్లబడిన తర్వాత జగన్ ను పార్టీ అధిష్ఠాన వర్గం ఢిల్లీకి పిలిపించే అవకాశాలున్నాయి. వచ్చే నెల 13వ తేదీ లోగా ఎప్పుడైనా సిఎల్పీ సమావేశం పెట్టవచ్చుననే మాట వినిపిస్తోంది. అంటే, ఆశలు సజీవంగా ఉంచుతూనే జగన్ వర్గాన్ని తన మాటకు కట్టుబడేలా చేయడం పార్టీ అధిష్ఠాన వర్గం ఎత్తుగడగా భావించవచ్చు. జగన్ పూర్తిగా దిగి వచ్చేదాకా వ్యవహారాన్ని వ్యవహారాన్ని పార్టీ అధిష్టాన వర్గం సాగదీస్తుందనేది కచ్చితంగానే చెప్పవచ్చు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications