హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపి ఇంట్లో మంత్రుల భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

KVP
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెసు అధిష్ఠాన వర్గం సుముఖంగా లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు మంగళవారం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు నివాసంలో సమావేశమయ్యారు. అంతకు ముందు కెవిపి రామచందర్ రావు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలను ఆయన జగన్ కు వివరించారు. సోమవారం రాత్రి ఢిల్లీకి తిరిగి వచ్చిన కెవిపి తీవ్ర నిరాశతో కనిపించారు. మీడియాతో ఎక్కువగా మాట్లడడానికి ఇష్టపడలేదు.

జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత కెవిపి తన నివాసంలో మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు సుదర్శన్ రెడ్డి, ముఖేష్ గౌడ్, కన్నా లక్ష్మినారాయణ, గాదె వెంకటరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి హాజరైనట్లు సమాచారం. మంత్రులు చాలా మంది జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ చర్చలు బుధవారం కూడా కొనసాగుతాయని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X