హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై మంత్రులు తలో మాట

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే విషయంపై మంత్రులు తలో మాట మాట్లాడారు. కెవిపి రామచందర్ రావుతో మంగళవారం సమావేశమైన తర్వాత వారు మీడియాతో తమ అభిప్రాయాలను చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ అన్నారు. సిఎల్పీ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా అధిష్ఠాన వర్గమే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సిఎం అభ్యర్థిత్వంపై అధిష్ఠాన వర్గం చేసే సూచనలకు తాము కట్టుబడి నడుచుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. కెవిపిని తాము మర్యాదపూర్వకంగానే కలిశామని, దీనికి రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు.

ఢిల్లీలో పార్టీ అధిష్ఠాన వర్గంతో జరిపిన చర్చల వివరాలు తెలుసుకోవడానికి తాము కెవిపి నివాసానికి వచ్చినట్లు మంత్రి డికె అరుణ చెప్పారు. రాష్ట్ర ప్రజల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పార్టీ అధిష్ఠానవర్గానికి తెలుసునని ఆమె అన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తాము నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు. అంతా సవ్యంగా జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు ఆమె తెలిపారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని మంత్రి గల్లా అరుణ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో ఢిల్లీ వివరాలు కెవిపి తమకు చెప్పారని ఆమె అన్నారు. పార్టీ అధిష్ఠాన వర్గం జగన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలనే విషయంపై అప్పుడే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X