Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ పిలుపు: ఢిల్లీకి నేదురమల్లి

Nedurumalli Janardhan Reddy
నెల్లూరు: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురమల్లి జనార్దన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో తలెత్తిన నాయకత్వ సమస్యపై చర్చించేందుకే ఆయనను ఢిల్లీకి పిలిపించినట్లు భావిస్తున్నారు. గతంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని నేదురమల్లి జనార్దన్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు. ఆయన జగన్ కు మద్దతు వ్యక్తం చేశారు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి మొదటి విడత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. నిజానికి, నేదురమల్లి జనార్దన్ రెడ్డి వైయస్ వ్యతిరేకులే అయినప్పటికీ ప్రస్తుతం జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+