జాబిల్లిపై నీరు ఎక్కువే: మాధవన్

చంద్రయాన్ ప్రధాన లక్ష్యం నెరవేరిందని, చందమామపై నీరుందని కనిపెట్టడం గొప్ప విజయమని తాను ప్రపంచానికి చాటి చెప్పగలనని ఆయన అన్నారు. చంద్రయాన్ సేకరించిన వివరాలను విశ్లేషించడానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల కాలం పడుతుందని ఆయన అన్నారు. చంద్రుడి ధృవ ప్రాంతంలో జలం, హైడ్రాక్సైల్ ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. జలం సముద్ర, సరస్సు రూపాల్లో గానీ బిందువుల రూపాల్లో గానీ లేదని, చందమామపై గల ఖనిజాలతో కలిసి ఉందని ఆయన వివరించారు. అటువంటి పదార్థాలు అంచనాకు మించే ఉన్నాయని ఆయన అన్నారు.
చంద్రుడిపై జలం ఎలా ఉందనేది ఇప్పటికీ ఆశ్చర్యమేనని ఆయన అన్నారు. చంద్రుడి ఉపరితలంపైకి నిరంతరాయంగా వీస్తున్న సౌర గాలుల వల్ల జలం తయారై ఉండవచ్చునని ఆయన అన్నారు. సౌర గాలుల్లో ఉండే హైడ్రోజన్ చంద్రుడి ఉపరితలంపై గల ఖనిజాల్లోని ఆక్సిజన్ తో కలిసి జలం ఏర్పడి ఉంటుందని ఆయన వివరించారు. జలం పరమాణువులు ఉన్నంత మాత్రాన చంద్రుడిపై జీవనం సాగించడానికి వీలవుతుందని చెప్పలేమని ఆయన అన్నారు. చంద్రుడిపై శాశ్వత పునాది ఏర్పాటుకు అవకాశాలు లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications