పావురాలగుట్టలో జగన్ నివాళి

YS Jaganmohan Reddy
కర్నూలు: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి వైయస్ జగన్ శుక్రవారం పావురాలగుట్టలో నివాళులు అర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన పావురాలగుట్ట ప్రాంతానికి జగన్ ఉదయం చేరుకున్నారు. ఇడుపులపాయ నుంచి ఆయన హెలికాప్టర్ లో కర్నూలు జిల్లా నల్లకాలువకు చేరుకున్నారు. ఆ తర్వాత కాన్వాయ్ గా వాహనంలో ఆయన పావురాల గుట్టకు బయలుదేరి వెళ్లారు.

కొంత దూరం నడిచి పాపురాల గుట్టకు చేరుకున్నారు. అక్కడ ఆయన తండ్రి మృతికి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు శాసనసభ్యులు కొంత మంది ఉన్నారు. అక్కడి నుంచి కాలినడకన రోడ్డు మార్గానికి బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన శుక్రవారం ఒంటి గంట ప్రాంతానికి నల్లకాలువ చేరుకుని అక్కడ ఏర్పాటైన సంతాపసభలో ప్రసంగిస్తారు. అనంతరం ఆయన కర్నాటక రాజధాని బెంగుళూర్ కు బయలుదేరి వెళ్తారు. ఆయన వ్యాపారాలన్నీ బెంగుళూర్ కేంద్రంగానే సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+