వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

Air India
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలట్లు సమ్మెకు దిగారు. దీంతో సంస్థ రెండు విమానాలను శనివారం రద్దు చేసింది. పైలట్లు విధులకు హాజరు కాకపోవడంతో ఎయిర్ ఇండియా ముంబై, కాబూల్ విమానాలను రద్దు చేసింది. ముంబై వెళ్లే ప్రయాణికులను తదుపరి విమానంలో పంపించారు. కాబూల్ వెళ్లే ప్రయాణికులను మాత్రం హోటళ్లో ఉంచారు.

ఉత్పాదక సంబంధమై న రాయితీలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొంత మంది ఎగ్జిక్యూటివ్ పైలట్లు సమ్మెకు దిగుతామని శుక్రవారం రాత్రి హెచ్చరించారు. వేతనాల్లో కోత వల్ల పని చేయడానికి ఇష్టంగా లేరని, దీంతో సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారని ఎగ్జిక్యూటివ్ పైలట్ల ప్రతినిధి కెప్టెన్ భల్లా చెప్పారు.

ఎయిర్ ఇండియాలో దాదాపు 300 మంది ఎగ్జిక్యూటివ్ పైలట్లున్నారు. వారు ఎయిర్ లైన్స్ యాజమాన్యంలో భాగం కాబట్టి వారు సంఘం ఏర్పాటు చేయడానికి గానీ సమ్మెకు దిగడానికి గానీ వీలు లేదని యాజమాన్యం అంటోంది. ఒక కలం పోటుతో సిఎండి అరవిద్ జాదవ్ 70 శాతం వేతనంలో కోత పెట్టారని భల్లా అన్నారు. వేతనాల కోతపై చైర్మన్ ఎగ్జిక్యూటివ్ పైలట్లతో చర్చించలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X