వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎయిర్ ఇండియా పైలట్ల సమ్మె
ఉత్పాదక సంబంధమై న రాయితీలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొంత మంది ఎగ్జిక్యూటివ్ పైలట్లు సమ్మెకు దిగుతామని శుక్రవారం రాత్రి హెచ్చరించారు. వేతనాల్లో కోత వల్ల పని చేయడానికి ఇష్టంగా లేరని, దీంతో సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారని ఎగ్జిక్యూటివ్ పైలట్ల ప్రతినిధి కెప్టెన్ భల్లా చెప్పారు.
ఎయిర్ ఇండియాలో దాదాపు 300 మంది ఎగ్జిక్యూటివ్ పైలట్లున్నారు. వారు ఎయిర్ లైన్స్ యాజమాన్యంలో భాగం కాబట్టి వారు సంఘం ఏర్పాటు చేయడానికి గానీ సమ్మెకు దిగడానికి గానీ వీలు లేదని యాజమాన్యం అంటోంది. ఒక కలం పోటుతో సిఎండి అరవిద్ జాదవ్ 70 శాతం వేతనంలో కోత పెట్టారని భల్లా అన్నారు. వేతనాల కోతపై చైర్మన్ ఎగ్జిక్యూటివ్ పైలట్లతో చర్చించలేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, September 26, 2009, 10:48 [IST]