హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభా నాగిరెడ్డిపై చిరంజీవి సీరియస్

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిపై చర్య తీసుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ఒత్తిడి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నల్లకాలువలో వైయస్ రాజశేఖరరెడ్డి సంస్మరణకు వెళ్లడమే కాకుండా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శోభా నాగిరెడ్డి అనడాన్ని పార్టీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. శోభా నాగిరెడ్డిపై చర్యలకు రాజకీయ వ్యవహారాల కమిటీని వెంటనే సమావేశపరచాలని కూడా ఆ వర్గం డిమాండ్ చేస్తోంది. దీనిపై చిరంజీవి సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

కాగా, శోభా నాగిరెడ్డి వ్యవహారాన్ని తేలిక చేసి చూపేందుకు మరో వర్గం ప్రయత్నిస్తోంది. శోభా నాగిరెడ్డి వైయస్ సంస్మరణ సభకు మాత్రమే వెళ్లారని, అంతకు మించి ఏమీ లేదని ఈ వర్గం వాదిస్తోంది. ఆమె పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని కూడా వాదిస్తోంది. పార్టీ నుంచి ఆమె వెళ్లిపోయే ప్రసక్తి లేదని కూడా చెబుతున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని ఈ వర్గం అంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X