కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ నేతను చంపిన మావోలు

By Staff
|
Google Oneindia TeluguNews

Naxalites
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఏదులాపురం గ్రామంలో కాంగ్రెసు నాయకుడు సమ్మిరెడ్డిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. భూములు కొనకూడదని తాము చేసిన హెచ్చరికను ఖాతరు చేయకపోవడంతో నక్సలైట్లు సమ్మిరెడ్డిని కాల్చి చంపారు. ఘటనా స్థలం వద్ద పెద్దపల్లి ఏరియా రమేష్ దళం పేరిట ఒక లేఖ లభించింది.

ఇటీవలి కాలంలో కరీంనగర్ జిల్లాలో తిరిగి నక్సలైట్ కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. చాలా కాలంగా కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి తగ్గు ముఖం పట్టినట్లు కనిపించింది. మావోయిస్టుల చర్యను పరికిపంద చర్యగా జిల్లా ఎస్పీ అభివర్ణించారు. తమ ఉనికిని చాటుకోవడానికే మావోయిస్టులు ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X