హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదేం సోది: శోభా నాగిరెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: తాను కర్నూలు జిల్లా నల్ల కాలువలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సంస్మరణకు వెళ్లడంపై పార్టీలోని ఒక వర్గం వ్యతిరేకించడంపై ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి తీవ్రంగా చిరాకు పడ్డారు. తాను సంస్మరణ సభకు వెళ్లడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె అన్నారు. ఒక నాయకుడి సంస్మరణకు వెళ్లడం తప్పేమీ కాదని ఆమె అన్నారు.

తాను కాంగ్రెసు పార్టీ సభకు వెళ్లలేదని, నాయకుడి సంస్మరణకు వెళ్లానని, ఇంత చిన్న విషయంపై రాద్ధాంతం చేయడం తగదని ఆమె అన్నారు. తాను అందరిలాగే రాజశేఖర రెడ్డి మృతికి నివాళులర్పించానని, ఇందులో రాజకీయమేదీ లేదని ఆమె అన్నారు. తమ పార్టీ నేత చిరంజీవి మంచితనాన్ని కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీకి అతీతంగా వెళ్లామని, వైయస్ కుటుంబానికి తమకు కుటుంబానికి వ్యక్తిగత సంబంధాల వల్లనే వెళ్లామని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X