వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ లో దాడులు: 16 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Peshawar
పెషావర్: పాకిస్తాన్ లో జరిగిన రెండు కారుబాంబు పేలుళ్ల సంఘటనల్లో 16 మంది మరణించారు. దాదాపు 150మంది గాయపడ్డారు. మరో బాంబు దాడిలో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుళ్లు నార్త్ వెస్ట్ పాకిస్తాన్ లో జరిగాయి. ఒక బాంబు పేలుడు పెషావర్ లోని సైన్యానికి చెందిన బ్యాంకు వెలుపల సంభవించింది. ఈ సంఘటనలో పది మరణించారు. 79 మంది గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి వాహనాలు పల్టీ కొట్టాయి. భవంతులు కూలిపోయాయి.

అంతకు ముందు బన్ను జిల్లాలోని పోలీసు స్టేషన్ లోకి కారు బాంబు దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో ఆరుగురు మరణించగా, 70 మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన బన్ను జిల్లాలోని పోలీసు స్టేషనులో జరిగింది. పోలీసు స్టేషన్ భవనం కూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి, ఒక ఖైదీ ఉన్నట్లు భావిస్తున్నారు.

ప్రభుత్వ తీరును తాము నిరసిస్తున్నామని, పాకిస్తాన్ దాడులను ఆపాల్సిన అవసరాన్ని గుర్తించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మాహుతి దాడులు పెరుగుతాయని తాలిబన్ అధికార ప్రతినిధి ఖారీ హుస్సేన్ మెహసూద్ అసోసియేటెడ్ ప్రెస్ కు ఫోన్ చేసి చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X