వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదకర స్థాయిలో శ్రీశైలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srisailam
కర్నూలు: శ్రీశైలం జలాశయంలో వరద నీటి ప్రవాహం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. శ్రీశైలంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, పది అడుగులు ఎక్కువగా శ్రీశైలంలో నీటి మట్టం ఉంది. దీంతో కుడిగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రానికి నీరు చేరే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ విద్యుదుత్పత్తి నిలిపేశారు. నారాయణపూర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో వరద మట్టం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ఎడమ గట్టు విద్యుత్ కేంద్రానికి కూడా నీటి ప్రమాదం పొంచి ఉంది. రెండు అడుగుల మేర కేంద్రంలో నీరు వచ్చి చేరింది. జల విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరకుండా ఇసుక బస్తాలు అడ్డం వేస్తున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషు అక్కడే ఉండి ప్రమాదాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు ఉంది. తుంగభద్ర ఇన్ ఫ్లో 85 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో కూడా 85 లక్షల క్యూసెక్కులు ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X