హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య పాలన భళే: జానా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్య పాలన చాలా బాగుందని మాజీ హోం మంత్రి, సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు కె.జానా రెడ్డి కొనియాడారు. ఆయన గురువారం రోశయ్యను కలుసుకున్నారు. రోశయ్య అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తారని, సంయమనంతో సాగుతారని ఆయన రోశయ్యతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వరద సహాయ చర్యల్లో భాగంగా రోశయ్యకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జానా రెడ్డి అన్నారు. డిజిపి బదిలీ పరిపాలనలో ఓ భాగం మాత్రమేనని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జానారెడ్డి సమాధానమిచ్చారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే మంత్రివర్గ విస్తరణపై మాట్లాడటం సరి కాదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు శ్రీకారం చుట్టబోతున్నట్లు, జానారెడ్డి వంటి సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోశయ్యతో జానా రెడ్డి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X