ప్రధాని తప్పించుకుంటున్నారు: బాబు

Chandrababu Naidu
కర్నూలు: రాష్ట్రంలో సంభవించిన వరద ముప్పును జాతీయ విపత్తుగా ప్రకటించే విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రధాని ప్రకటించిన వంద కోట్ల రూపాయల అడ్వాన్స్ ఏ మాత్రం సరిపోదని ఆయన కర్నూలులో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పరదలను జాతీయ విపత్తుగా అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆయన అడిగారు. వరద సహాయక చర్యల విషయంలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కె.రోశయ్య మంత్రులను నియంత్రించాలని, వరద తాకిడి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించాలని ఆయన అన్నారు. తాము మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నట్లు మంత్రులు విమర్శిస్తున్నారని, ముందు వారు రాజకీయాలు మాని వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని, తాము ఇప్పటికే చాలా సంయమనం పాటించాం, పాటిస్తామని ఆయన అన్నారు. మంత్రులు ప్రకటనలకే పరిమితవుతున్నారని, వరద తాకిడి ప్రాంతాలకు వెళ్లడం లేదని, పూర్తి బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రేపల్లె వద్ద గండి పడుతుందని ముందే తెలిసినా మంత్రులు అక్కడికి షికారుకు వెళ్లినట్లు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు.

వరద తాకిడి ప్రాంతాల్లో ప్రభుత్వం యంత్రాంగం పని చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో చేపట్టింది జలయజ్ఞం కాదు, ధన యజ్ఞమని తాము ఆనాడే చెప్పామని ఆయన గుర్తు చేశారు. వరద సహాయక చర్యల విషయంలో బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టం లేకపోతే మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మంత్రులు పని చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+