వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘువీరాపై తెలుగుదేశం నేతల మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodela Sivaprasad
హైదరాబాద్: గుంటూరు జిల్లాలోని ఓలేరు కరకట్టను తెలుగుదేశం పార్టీవారే తెగగొట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం నాయకులు కోడెల శివప్రసాద రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా మండిపడ్డారు. రఘువీరా రెడ్డి వ్యాఖ్యలను వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ఓలేరు కరకట్ట తెగిపోయిన సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు.

వరద సహాయక చర్యల నిధులను కాంగ్రెసు కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. వరద సహాయ నిధుల్లో సగం రాబందుల్లా మెక్కుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. వరదలను నివారించడంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని, అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే వరదలు సంభవించాయని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X