వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ పై తిరస్కృత ప్రియుడి దావా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
అమృత్ సర్: తనను మోసం చేసిందని ఆరోపిస్తూ బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ పై స్థానిక జతన్ శర్మ అనే షాప్ కీపర్ క్రిమినల్, సివిల్ దావాలు వేశాడు. ఎంతో గుండె బరువుతో తాను ఈ చర్యకు దిగుతున్నట్లు జతిన్ ఫస్ట్ క్లాస్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ బగీచా సింగ్ ముందు చెప్పుకున్నారు. రాఖీ సావంత్ తన హృదయాన్ని బాధపెట్టడమే కాకుండా తన మనోభావాలతో ఆడుకుందని అతను ఆరోపించాడు.

ఎన్టీటివి ఇమాజిన్ రియాల్టీషో రాఖీ కా స్వయంవర్ లో ఆమెను గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశాడు. ఒక ఎపిసోడ్ లో ఆమె కోసం సాహసం చేయబోయి గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఆ విషయం తెలిసి అతన్ని రాఖీ సావంత్ రియాల్టీ షోకు అహ్వానించింది. రాఖీ ఆహ్వానంతో అతను ముంబై, ఢిల్లీ, రిషికేష్ తిరిగాడు. అయితే రాఖీ అతన్ని పట్టించుకోనే లేదు. రాఖీ అందుకు విచారం వ్యక్తం చేసింది. అమృత్ సర్ లో కలుస్తానని హామీ ఇచ్చింది. అయితే ఆమె కలువలేదు. ఈ స్థితిలో జతిన్ కోర్టులో దావా వేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X