రోశయ్యకు దారి: జగన్ దే బాధ్యత

జగన్ దాదాపు 20 నిమిషాల పాటు సోనియా గాంధీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రోశయ్యకు సహకరించడం మినహా మార్గం లేదని ఆమె చెప్పినట్లు సమాచారం. అందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో సోనియా నిర్ణయం శిరోధార్యమని జగన్ ప్రకటించారని అంటున్నారు. అయితే జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కానీ జగన్ అందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఏనాటికైనా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలనేదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications