న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంతో పొత్తు ఉంటుందో, లేదో చెప్పలేనని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. ఆయన మంగళవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి పొత్తుల విషయంలోనే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోలేదని, మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కూడా గతంలో రాష్ట్రస్థాయిలోనే జరిగిందని ఆయన చెప్పారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకునేవాడినని ఆయన చెప్పారు.