హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఠాల కాంగ్రెసు మాకొద్దు: పిఆర్పీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Prajarajyam
హైదరాబాద్: కాంగ్రెసు ముఠా తగాదాల్లోకి తాము రాదలుచుకోలేదని ప్రజారాజ్యం పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెసు పిలిస్తేనే తాము పొత్తు చర్చలకు వెళ్లామని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి జె. గౌతం మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం కావాలని మంత్రి రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యను ఆయన ఖండించారు. పొత్తు విషయంలో మీడియా కథనాలను కూడా ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు ముఠా తగాదాల్లోకి తాము రాదలుచుకోలేదని, అందుకే పొత్తు ప్రతిపాదన నుంచి విమరించుకుంటున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు రాష్ట్రంలోనే మరో అధిష్టానం ఉందని తమకు అంతకు ముందు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. పొత్తుల గురించి తాము ఆలోచించబోమని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత చిరంజీవి దిష్టిబొమ్మను కాంగ్రెసు కార్యకర్తలు దగ్ధం చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో వంగా గీత, బండారు సత్యానందరావు ఇతర పార్టీ శాసనసభ్యులు కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X