వామపక్షాలపై చంద్రబాబు గుర్రు

చర్చలు కొలిక్కి రాకముందే సిపిఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. చర్చలు కొలిక్కి రాకముందే సిపిఎం జాబితాను విడుదల చేయాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో తమకు ఎదురైన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఎం ఈ చర్యకు దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం వల్లనే శాసనసభ ఎన్నికల్లో నష్టం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
కాగా, కాంగ్రెసు తన అభ్యర్థుల జాబితాను ఈ నెల 5వ తేదీన విడుదల చేయనుంది. ఇందుకు గాను కాంగ్రెసు రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. ప్రజారాజ్యంతో పొత్తు లేనట్లేనని తేలిపోయింది. దీంతో కాంగ్రెసు పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications