వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీల కేసు నుంచి తప్పుకున్న జడ్జి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani
న్యూఢిల్లీ: అంబానీల గ్యాస్ వివాదం కేసులో మరో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ కేసు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్ వి రవీంద్రన్ తప్పుకున్నారు. ప్రయోజనాల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో ఆయన కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ముఖేష్ అంబానీ గ్రూపునకు సలహా ఇస్తున్న సోలిసిటర్స్ సంస్థలో తన కూతురు పనిచేస్తున్నట్లు నిన్ననే తన దృష్టికి వచ్చిందని, దాంతో తాను కేసు విచారణనుంచి తప్పుకుంటున్నానని జస్టిస్ రవీంద్రన్ చెప్పారు.

గత ఏడాది కాలంగా ముఖేష్ అంబానీ గ్రూపు ప్రాజెక్టులకు సలహాలు ఇస్తున్న బెంగుళూర్ లోని ఎజడ్బీ పార్ట్నర్స్ లో తన కూతురు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రవీంద్రన్ తప్పుకోవడంతో అంబానీ సోదరుల గ్యాస్ వివాదం కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి మరో బెంచ్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. ప్రస్తుత బెంచ్ లో రవీంద్రన్ తో పాటు ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్, జస్టిస్ పి. శాతసివన్ ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X