హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉంచుకుంటారా? చంపుకుంటారా?: కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాదు: గ్రేటర్‌ ఎన్నికలు తమకు ప్రధానం కాదని, కెసిఆర్ శవయాత్రలో పాల్గొంటారో, తెలంగాణా విజయయాత్రలో పాల్గొంటారో తెలంగాణా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయమిదని కెసిఆర్ అన్నారు. ఈసారి ఉద్యమం మధ్యస్థంగా ముగిసేది కాదు, అటోఇటో తేలిపోవాల్సిందేనని కెసిఆర్ చెప్పారు. తనను ఉంచుకోవాలో చంపుకోవాలో తేల్చుకోవలసింది తెలంగాణ ప్రజలేనని ఆయన అన్నారు.

ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రపతి, ప్రధాని, సోనియా గాంధీ, అద్వానీలను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తానని, ఈనెల 7,8,9 తేదీల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆరోతేదీ నుంచి తెలంగాణ సంఘాలు, ఉద్యమసంస్థలతో తెలంగాణావ్యాప్తంగా 15 వేల సమావేశాలు నిర్వహించనున్నామని ఆయన తెలియజేశారు. రేపు గవర్నర్‌ని, ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి ఆమరణ నిరాహార దీక్ష విషయాన్ని చెబుతానని కెసిఆర్ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X