వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం, కెసీఅర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
వేములవాడ : తెలంగాణ రాష్ట్ర సాధనకే నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు తెలిపారు. ఆదివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సాధనకు చేస్తున్న శాంతియుత పోరాటంలో భాగంగానే నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఈ నెలలోగా ఏదో ఒకటి తేల్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో సమావేశం కానున్నారు. 2004లో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన హామీని.. ఆయన ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సాగించనున్న ఉద్యమం, చేపట్టదలచిన ఆమరణ నిరాహార దీక్ష గురించి ప్రతిభకు తెలపనున్నారు. సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ప్రతిపక్ష నేత ఎల్‌.కె.అద్వానీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి శరద్‌పవార్‌, యూపీ ముఖ్యమంత్రి మాయావతితో కేసీఆర్‌ సమావేశమవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X