హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ దారిలోనే రోశయ్య వివక్ష: హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దారిలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య సాగుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు. రోశయ్య కూడా తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వరద సహాయంలో కూడా రోశయ్య ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిందని ఆయన అన్నారు.

వరద సహాయక చర్యల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వరదల్లో నష్టపోయిన రోడ్ల మరమ్మతుల కోసం రోడ్లు భవనాల శాఖ కర్నూలు జిల్లాకు 130 కోట్ల రూపాయలు కేటాయించగా మహబూబ్ నగర్ జిల్లాకు 30 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని, తెలంగాణ పట్ల వివక్షకు ఇది ఉదాహరణ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ వివక్షపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డికె అరుణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X