చంద్రబాబుకు పిచ్చి పట్టింది: గాలి

వైయస్ జగన్ తెల్ల కాగితం లాంటివాడని, జగన్ పై ఆరోపణలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని, లక్ష మధుకోడాలతో సమానమైన చంద్రబాబుకు జగన్ ను విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. తనదీ, స్వర్గీయ వైయస్సార్ ది కొడుకూతండ్రుల వంటి సంబంధమని, వైయస్సార్ మంచి మనసుతో ఉక్కు కర్మాగారం స్థాపనకు అనుతిచ్చారని, ఆ మహా వ్యక్తికి సంతాపం ప్రకటించే వీలు కూడా లేకుండా చంద్రబాబు తనపై, జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు లాంటి నీచ నికృష్టమైన నేత ప్రపంచంలోనే లేడని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మబోరని, అందుకే రెండోసారి కూడా ఓడించారని ఆయన అన్నారు. అవసరమైతే తాను ఆంధ్రప్రదేశ్ లో ఉండి మరోసారి చంద్రబాబును ఓడిస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు నీచుడు, నికృష్టుడని, ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచారని, తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఖడ్గ మృగం లాంటివాడని ఆనయ వ్యాఖ్యానించారు.
వైయస్సార్ లేకపోవడం వల్ల తమకు దిక్కు లేదని చంద్రబాబు అనుకుంటున్నారని, తమకు దేవుడి ఆశీస్సులున్నాయని ఆయన అన్నారు. ఓబుళాపురం గనులను కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మీడియాకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మీడియాకు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. చంద్రబాబువి తప్పుడు కూతులని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చంద్రబాబు దుష్ర్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలను విస్మరించి చంద్రబాబు తమ కంపెనీపై పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications