హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు పిచ్చి పట్టింది: గాలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నారని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత, కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ విషయంలో చంద్రబాబుకు కోర్టుల్లో కూడా ఎదురు దెబ్బ తగిలిందని, మళ్లీ అదే పద్ధతిని ప్రారంభించారని ఆయన అన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, మీడియాలపై చంద్రబాబుకు గౌరవం లేదని ఆయన అన్నారు. స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వేసిన అఖిల పక్ష కమిటీ ఓబుళాపురం మైన్స్ ను చూసి అక్రమాలు లేవని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మనిషైతే, చంద్రబాబుకు దమ్ముంటే తన అక్రమాలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రుజువు చేయలేకపోతే చంద్రబాబు తలవంచుకుని ఇంట్లో కూర్చోవాలని ఆయన సవాల్ చేశారు. రామోజీరావు, రాధకృష్ణ, చంద్రబాబులను భగవంతుడు కూడా కాపాడలేడని ఆయన అన్నారు. తాను వేసిన పరువు నష్టం కేసుల నుంచి వారు తప్పించుకోలేరని ఆయన అన్నారు. చంద్రబాబుపై గాలి జనార్దన్ రెడ్డి శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను రెడ్డిని కాబట్టే చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైయస్ జగన్ తెల్ల కాగితం లాంటివాడని, జగన్ పై ఆరోపణలు చేసే హక్కు చంద్రబాబుకు లేదని, లక్ష మధుకోడాలతో సమానమైన చంద్రబాబుకు జగన్ ను విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. తనదీ, స్వర్గీయ వైయస్సార్ ది కొడుకూతండ్రుల వంటి సంబంధమని, వైయస్సార్ మంచి మనసుతో ఉక్కు కర్మాగారం స్థాపనకు అనుతిచ్చారని, ఆ మహా వ్యక్తికి సంతాపం ప్రకటించే వీలు కూడా లేకుండా చంద్రబాబు తనపై, జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు లాంటి నీచ నికృష్టమైన నేత ప్రపంచంలోనే లేడని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మబోరని, అందుకే రెండోసారి కూడా ఓడించారని ఆయన అన్నారు. అవసరమైతే తాను ఆంధ్రప్రదేశ్ లో ఉండి మరోసారి చంద్రబాబును ఓడిస్తానని ఆయన అన్నారు. చంద్రబాబు నీచుడు, నికృష్టుడని, ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచారని, తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఖడ్గ మృగం లాంటివాడని ఆనయ వ్యాఖ్యానించారు.

వైయస్సార్ లేకపోవడం వల్ల తమకు దిక్కు లేదని చంద్రబాబు అనుకుంటున్నారని, తమకు దేవుడి ఆశీస్సులున్నాయని ఆయన అన్నారు. ఓబుళాపురం గనులను కర్నాటక, ఆంధ్రప్రదేశ్ మీడియాకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మీడియాకు కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. చంద్రబాబువి తప్పుడు కూతులని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చంద్రబాబు దుష్ర్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలను విస్మరించి చంద్రబాబు తమ కంపెనీపై పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X