వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గాలి'ఉల్లంఘనలు నిజమే: కమిటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం తవ్వకాల విషయంలో అటవీ సంరక్షణ నిబంధనలను ఉల్లంఘించిన మాట నిజమేనని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ తేల్చింది. సాధికారిక కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఓబుళాపురం, తదితర కంపెనీలు ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో చేపట్టిన తవ్వకాలపై ఆగస్టు 24వ తేదీన తపాలా గణేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (ఫిల్) దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు నిజానిజాలను నిర్ధారించడానికి సాధికారిక కమిటీని నియమించింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అటవీ సంరక్షణ నిబంధనలను ఉల్లంఘించిందని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. తవ్వకాల్లో ధ్వంసమైన జిటి స్టేషన్ ను, సుంకులాంబ ఆలయాన్ని పునరుద్ధరించాలని సాధికారిక కమిటీ అభిప్రాయపడింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో పాటు ఇతర మైనింగ్ కంపెనీలు లీజు పొందిన ప్రాంతాల హద్దుల నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెవెన్యూ, అటవీ, పర్యావరణ, గనుల శాఖల సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని సిఫార్సు చేసింది. అంత వరకు తవ్వకాలను ఆపించాలని, తవ్విన ఇనుప ఖనిజం రవాణాను ఆపాలని, దాన్ని సీజ్ చేయాలని సూచించింది. అక్రమాలు నిజమని తేలితే లీజులు రద్దు చేయాలని సూచించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X